కీలక రేట్లు యథాతథం… డిజిటల్ మోసాల బాధితులకు ఊరట, ఎంఎస్ఎమ్ఈలకు భారీ భరోసా.. ప్రకటించిన ఆర్బీఐ Key Rates Unchanged… RBI Announces Relief for Digital Fraud Victims, Big Boost for MSMEs
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చివరిదైన ఆరో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయాలను (RBI Announces) ప్రకటించింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ, దేశీయ ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయన్న అంచనాతో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. అదే సమయంలో బ్యాంకు ఖాతాదారులు, చిన్న పరిశ్రమలు, ఎన్బీఎఫ్సీలు, రియల్ ఎస్టేట్ రంగం వంటి విభాగాలకు గణనీయమైన ఊరట కలిగించే ప్రకటనలు చేసింది. డిజిటల్ మోసాల బాధితులకు పరిహారం…

