ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయా? కేంద్ర సర్కారుపై ఇంధన ధరల ఒత్తిడి పడనున్నదా? ఎరువుల సబ్సిడీ (West Asian crisis) కేంద్ర సర్కారుకు భారం కానున్నదా? భవిష్యత్తు భారతం భారం అవుతుందా? అంటే అవుననే అంటున్నారు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఎక్స్పెండీచర్ సెక్రటరీ వీ వువల్నామ్. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి కేవలం 3 నెలలు కూడా గడవకముందే, దేశ ఆర్థిక ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయిందని, రాబోయే రోజులు అత్యంత సవాలుతో కూడుకున్నవని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ఉన్న సానుకూల పరిస్థితులు ఇప్పుడు లేవని వువల్నామ్ పేర్కొన్నారు. “బడ్జెట్ ప్రవేశపెట్టి కేవలం మూడు నెలలే అయినప్పటికీ, అప్పటి పరిస్థితులకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల వల్ల గంట గంటకూ పరిస్థితులు మారిపోతున్నాయి. రేపు ఏం జరుగుతుందో చెప్పలేని అనిశ్చితి నెలకొంది” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ అనుసరిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ (West Asian crisis) దేశాన్ని కొంతవరకు సురక్షితంగా ఉంచినప్పటికీ, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను తక్కువ అంచనా వేయలేమని ఆయన హెచ్చరించారు.
పెరుగుతున్న ఒత్తిడి
ప్రభుత్వ ఆదాయం, వ్యయాల విషయంలో ప్రస్తుతం పలు కీలక సవాళ్లు ఉన్నాయని ఆర్థిక శాఖ గుర్తించింది
ఇంధన ధరల ఒత్తిడి: పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా నియంత్రించడం, గతంలో ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం వల్ల ప్రభుత్వ రాబడిపై ఒత్తిడి పెరుగుతోంది.
ఎరువుల సబ్సిడీ: అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో, ఈ ఏడాది ఎరువుల సబ్సిడీ భారీగా పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్ అంచనాల కంటే అదనంగా సుమారు ₹ 50,000 కోట్ల భారం పడవచ్చని వువల్నామ్ అంచనా వేశారు.
పన్ను వసూళ్లలో వృద్ధి: గతంలో పన్ను వసూళ్లు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో గ్రాస్ ట్యాక్స్ రిసిప్ట్స్ విషయంలో వృద్ధి కొనసాగుతుందా? లేదా? అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది.
మూలధన వ్యయంపై వెనక్కి తగ్గేది లేదు (Focus on Capex)
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, దేశాభివృద్ధికి కీలకమైన Capital Expenditure (Capex) విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని సెక్రటరీ స్పష్టం చేశారు. “ఎన్ని సవాళ్లు ఎదురైనా మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించిన (West Asian crisis) నిధులను పూర్తి స్థాయిలో వినియోగిస్తాం. అభివృద్ధి వేగాన్ని తగ్గించకుండా తగినంత నిధులు సమకూరుస్తాం,” అని ఆయన హామీ ఇచ్చారు.
ఆర్థికవేత్త ఎన్.కె. సింగ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. గతంలో ఉన్న Goldilocks Moment (అన్నీ అనుకూలించే వాతావరణం) ఇప్పుడు ముగిసిందని, ఇకపై ప్రభుత్వం Quality of Expenditure (వ్యయ నాణ్యత) పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వువల్నామ్ పేర్కొన్నారు.
వ్యూహాలను మార్చుకుంటేనే..: డిపామ్ కార్యదర్శి
ఇదే క్రమంలో డీఐపీఏమ్ సెక్రటరీ అరునిష్ చావ్లా మాట్లాడుతూ.. రాబోయే దశాబ్దాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ తన వ్యూహాలను మార్చుకోవాలని సూచించారు. దేశం కేవలం సేవలపైనే కాకుండా మాన్యుఫాక్చరింగ్, విలువ ఆధారిత వ్యవసాయంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
జాబ్ క్రియేషన్: ప్రస్తుతం వస్తున్న ఉద్యోగ గణాంకాలను చూసి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్లలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
డీప్ టెక్ అండ్ సర్వీసెస్ః భవిష్యత్తులో డీప్ టెక్ సెక్టార్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాలే భారత ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తులుగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మొత్తానికి, పశ్చిమాసియా సంక్షోభం భారత ఆర్థిక లెక్కలను మారుస్తోంది. ఆదాయం తగ్గే అవకాశం ఉన్నా, సబ్సిడీల భారం పెరిగే సూచనలు కనిపిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం (West Asian crisis) వృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. రానున్న త్రైమాసికాలు భారత ఆర్థిక వ్యవస్థకు నిజమైన లిట్మస్ టెస్ట్ గా మారనున్నాయి.
