దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు తగ్గడంపై ఆర్ధిక నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత రెండేళ్లుగా అమలు చేస్తున్న పన్ను తగ్గింపులు, రాయితీలు, రిఫండ్ విధానాలు ప్రభుత్వ ఖజానాపై గణనీయ ప్రభావం చూపుతున్నాయని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, పరోక్ష పన్నుల వసూళ్లలో భారీ కోతలు నమోదవడంతో మొత్తం ఆదాయ వృద్ధి శాతం ఆశించిన స్థాయికి చేరలేదని ఆర్థిక శాఖాధికారులు అంగీకరిస్తున్నారు. పన్ను కోతలు, పెట్టుబడులు.. వినియోగం పెంచడానికి తీసుకున్న నిర్ణయాలు. కానీ ఇవి ప్రభుత్వ ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపించి రెవెన్యూ లోటును పెంచే ప్రమాదం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే, పన్ను వసూళ్లు స్థిరంగా ఉండాలి. కాబట్టి రాబోయే బడ్జెట్లో పన్ను కోతలు మరింత తగ్గే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ప్రత్యక్ష ఆదాయంలో మందగమనం.. Slower Growth in Direct Income
సాధారణంగా అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం పన్ను వసూళ్లకు బలమైనదిగా భావిస్తారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరునెలల వరకూ ఉన్న ఆధారాల ప్రకారం చూస్తే, పన్ను కోతలతో ప్రభుత్వానికి లభించే ప్రత్యక్ష ఆదాయంలో స్పష్టమైన మందగమనం కనిపిస్తోంది. ఇదే ధోరణి వచ్చే ఏడాది కూడా కొనసాగితే కేంద్ర-రాష్ట్రాల అభివృద్ధి వ్యయాలు మరియు సామాజిక సంక్షేమ పథకాలపై ప్రభావం పడే అవకాశముంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కార్పొరేట్ పన్ను తగ్గింపు ప్రభావం ..Impact of Corporate Tax Cut
దేశంలో పెట్టుబడులను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లోనే కంపెనీలకు కార్పొరేట్ పన్నును 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించింది. కొత్త కంపెనీలకు ఈ రేటు 15 శాతానికి తగ్గించింది. ఈ చర్య ఆ సమయంలో పెట్టుబడుల పట్ల పరిశ్రమలలో విశ్వాసాన్ని పెంచినప్పటికీ, దీని నేర ప్రభావం ప్రభుత్వం పొందే ఆదాయంపై పడింది. గత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ పన్ను వృద్ధి 17 శాతంగా నమోదైనా, ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో అది కేవలం 6–7 శాతం వరకే ఉందని ఉన్నత స్థాయి అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్నేళ్లు కార్పొరేట్ పన్నుల మీద ఆశలు పెట్టుకోవడం కష్టమని ఒక కీలక అధికారి వ్యాఖ్యానించారు. పెద్ద కంపెనీల లాభాలు పెరిగినా, పన్నులో తగ్గింపు కారణంగా ప్రభుత్వానికి వచ్చే వాటా తగ్గిపోయింది.
వ్యక్తిగత ఆదాయ పన్ను నిలకడ ..Stability in Personal Income Tax
గత బడ్జెట్లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో పలు రాయితీలు ప్రకటించింది. తక్కువ ఆదాయ వర్గాలపై పన్ను భారాన్ని తగ్గించడంతో ఉపాధి, వినియోగం పెరుగుతుందని భావించారు. అయితే ఈ చర్య ప్రభుత్వానికి తక్షణ ప్రయోజనం ఇవ్వలేదని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. సగటున వ్యక్తిగత పన్ను వసూళ్లు 12–14 శాతం పెరుగుతాయనే అంచనాలుంటాయి. అయితే ఈసారి అది 8–9 శాతం వద్దే నిలిచిపోయింది. ఉద్యోగం, చిన్న వ్యాపారాల విభాగంలో వృద్ధి ఆశించినంతగా లేకపోవడం, కొత్త పన్ను విధానంలో రాబడి తక్కువగా ఉండటం ప్రధాన కారణాలుగా గుర్తిస్తున్నారు.
GST వసూళ్లలో స్థిరత్వం .. Stability in GST Collections
గత రెండు సంవత్సరాలుగా GST వసూళ్లు ప్రతి నెలా రూ.1.5 లక్షల కోట్లు దాటుతున్నాయి. అంతకు ముందు స్థితితో పోలిస్తే ఇది మంచి సంకేతమే. కానీ ఈసారి నెలసరి వృద్ధి శాతం తగ్గిపోవడం ఆందోళనగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో ఎగుమతులు తగ్గడం, లోకల్ మార్కెట్లో కొన్ని రంగాల్లో వినియోగం బలహీనపడటం GSTపై ప్రత్యక్ష ప్రభావం చూపిందని నిపుణులు చెబుతున్నారు. వినియోగ రంగం పుంజుకుంటే GST మళ్లీ రెక్కలు తొడుక్కుంటుందని ఆశిస్తున్నప్పటికీ, పన్ను రేట్ల తగ్గింపు, రిఫండ్ల పెరుగుదల వల్ల నికర వసూళ్లు తగ్గే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
పన్ను కోతలతో ప్రభుత్వ ఖర్చులపై ఒత్తిడి.. Pressure on Government Spending Due to Tax Cuts
కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై భారీగా ఖర్చు చేస్తోంది. రోడ్లు, రైల్వేలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు… అన్నింటికీ భారీ కేటాయింపులు జరిగాయి. కానీ ఇప్పుడు ఆదాయ వృద్ధి తగ్గడంతో ఆ వ్యయాలను నిర్వహించేందుకు ప్రభుత్వం మరింత అప్పు చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితి రెవెన్యూ లోటు పెరగడాన్ని సూచిస్తోంది.
నిపుణులు ఏం చెబుతున్నారంటే.. What Experts Are Saying…
పన్ను రాయితీలు ఆవశ్యకమే కానీ అవి దీర్ఘకాలిక ప్రయోజనం ఇచ్చే రంగాలకు మాత్రమే వర్తించాలి. అధిక రాయితీలు తాత్కాలిక ఉపశమనమే కానీ దీర్ఘకాలంలో ప్రభుత్వానికి భారమే. ఈ కారణాల వల్లనే ప్రస్తుతం రెవెన్యూ డిపార్ట్మెంట్ పన్నుల కోతలు, రిఫండ్ విధానాలను తిరిగి సమీక్షిస్తోంది.
రుణభారం పెరుగుతుందా? Will the Debt Burden Increase?
ఆదాయం తగ్గితే ప్రభుత్వానికి రెండు మార్గాలు మాత్రమే మిగులుతాయి. ఒకటి ఖర్చులను తగ్గించడం. రెండోది అప్పు పొందడం. ఇన్ఫ్రా ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను కోత పెట్టడం రాజకీయపరంగా సాధ్యం కానందున ప్రభుత్వం అప్పులవైపు మొగ్గు చూపే అవకాశముందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అప్పు జీడీపీతో పోలిస్తే 57–58 శాతం వరకు ఉంది.
ఇది ఇప్పటికే ఆర్థిక వ్యవస్థకు అధిక భారం. పన్ను ఆదాయం ఇంకా తగ్గితే ఈ నిష్పత్తి 60 శాతాన్ని దాటే ప్రమాదం ఉంది.
పన్ను కోతల వల్ల కేంద్రానికి వచ్చే ఆదాయం తగ్గడంతో, రాష్ట్రాలకు లభించే పన్ను వాటాపై కూడా ప్రభావం పడుతోంది.
GST పరిహారం నిలిచిపోయిన తర్వాతే రాష్ట్రాలు ఆర్థిక ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు కేంద్ర పన్నుల వసూళ్లు తగ్గడంతో రాష్ట్రాలకు అందే వాటా కూడా తగ్గే ప్రమాదం ఉంది. దీంతో రాష్ట్రాలు తమ బడ్జెట్ వ్యయాలను తగ్గించుకోవాల్సి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు నడపటానికి రాష్ట్రాలు మరింత అప్పు చేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది.
వ్యాపార వాతావరణం .. Business Environment
పన్ను తగ్గింపు ఉద్దేశం వ్యాపారాలకు ఉపశమనమివ్వడం, పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించడం. కానీ పెట్టుబడులు భారీగా పెరగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, అధిక వడ్డీ రేట్లు, డిమాండ్ తగ్గుదల, రాజకీయ మార్పులపై వ్యాపార వర్గాల ఆందోళనలు దీనికి ప్రధాన కారణాలు.
మదుపరులు, మార్కెట్లు ఏం చెబుతున్నాయి? What Are Investors and Markets Saying?
స్టాక్ మార్కెట్లు ఇప్పటికీ విదేశీ పెట్టుబడులపై ఆధారపడుతున్నాయి. పన్ను కోతలతో కంపెనీల లాభాలు పెరిగినప్పటికీ, ప్రభుత్వ ఆదాయం తగ్గడం ఆర్థిక లోటును పెంచి మార్కెట్లకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని బ్రోకరేజీలు చెబుతున్నాయి. అయితే కంపెనీలు దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టితే, పన్ను కోతల ప్రభావం వచ్చే రెండేళ్లలో స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజలపై ప్రభావం? Impact on the People?
పన్ను కోతలు సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం కలిగించినా, ప్రభుత్వం ఖర్చులను తగ్గిస్తే అది పరోక్షంగా పౌరులపైనే ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు ఆరోగ్య రంగానికి కేటాయింపులు తగ్గవచ్చు. విద్య, సంక్షేమ పథకాలపై వ్యయాలు తగ్గిపోయే అవకాశం ఉంది. గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులు నెమ్మదించవచ్చు.
పన్ను సంస్కరణలు అవసరమా? Are Tax Reforms Necessary?
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం పన్ను రాయితీల కంటే పన్ను వసూళ్ల స్థిరత్వం ముఖ్యమైనది. చెల్లించాల్సిన వారు పన్నులు కట్టే విధానం బలపడాలి. పన్ను ఎగవేతను అరికట్టేందుకు టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ పెంచాలి. కార్పొరేట్ రాయితీలను అవుట్పుట్, పెట్టుబడులతో అనుసంధానించే విధానం తీసుకురావాలి
భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉండబోతోంది? What Will the Future Situation Be Like?
ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే వచ్చే రెండు త్రైమాసికాలు పన్ను వసూళ్ల పెరుగుదల కీలకం. వినియోగ రంగం పుంజుకుంటే GST మళ్లీ బలపడే అవకాశం ఉంది. వ్యక్తిగత పన్నుల్లో వృద్ధి సహజంగానే పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. కార్పొరేట్ పన్నుల్లో మాత్రం పెద్ద ఊపు వచ్చే ఏడాది కూడా కష్టమే. మొత్తం మీద ప్రభుత్వ వ్యయాలు – పన్ను ఆదాయం మధ్య సమతుల్యత సాధించడం ఇప్పుడు అత్యంత కీలకమైన సవాలు.
పన్ను రాయితీలతో మధ్యతరగతికి ఉపశమనం.. Tax Relief Brings Respite to the Middle Class
జీఎస్టీ 2.0 వ్యవస్థలో భాగంగా సుమారు 375 వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించబడ్డాయి. నిత్యవసరాల నుంచి గృహోపకరణాల వరకు పలు విభాగాల్లో రేట్లను తగ్గించడం వల్ల వినియోగదారులకు ఉపశమనంతో పాటు మార్కెట్లో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది. ‘‘వినియోగం పెరిగితే తయారీ, సేవల రంగాలకు ఊతమివ్వబడుతుంది. ఆ ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపేలా చేస్తుంది’’ అని ఆర్థిక వర్గాలు పేర్కొన్నాయి.
ద్రవ్య లోటు .. Fiscal Deficit
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక ఆరోగ్యంలో మరో కీలక అంశం ద్రవ్య లోటు. ప్రభుత్వం జీడీపీతో పోలిస్తే ద్రవ్య లోటును 4.4 శాతానికి తగ్గించాలన్న లక్ష్యంతో ఖర్చులను సరిచేస్తోంది. పన్ను రాయితీలు అమల్లో ఉన్నా, వసూళ్లు స్థిరంగా ఉండేలా విధానపరమైన మార్పులు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం తగ్గడం కూడా ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతమని నిపుణులు వివరిస్తున్నారు. ఇంధన ధరల స్థిరీకరణ, ఆహార పదార్థాల సరఫరా మెరుగుదల వంటి కారణాలతో ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గింది. దీంతో గృహస్థుల కొనుగోలు శక్తి పెరిగి, వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండొచ్చు .. Economic Growth May Remain Stable Next Year
ప్రస్తుత పరిస్థితుల రీత్యా వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థిరమైన వృద్ధి రేటు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ వినియోగం పెరుగుతున్న ధోరణి, మౌలిక సదుపాయాలపై కొనసాగుతున్న భారీ ఖర్చులు .. భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది కల్పిస్తాయని చెప్పొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో రోడ్లు, రైల్వేలు, డిజిటల్ సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న పెట్టుబడులు అంతర్గత డిమాండ్ను పెంచి ఉద్యోగావకాశాలను సృష్టిస్తాయి.

