ప్రపంచం మొత్తం ఒకే సారి ఉలిక్కిపడిన సందర్భాలు చరిత్రలో చాలా అరుదు. అలాంటి సందర్భాల్లో చమురు (Oil Turmoil) ఒకటి. ఎక్కడో ఒక మూల యుద్ధం మొదలైతే… దాని ప్రభావం నేరుగా మన జేబులపై పడుతుంది. నిన్న మొన్నటివరకు వార్తలకే పరిమితమైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇప్పుడు అంతర్జాతీయ చమురు మార్కెట్ను కుదిపేస్తున్నాయి. వెనెజువెలా వంటి ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశంపై అమెరికా చర్యలు పెద్దగా కదలిక రేపలేదు. కానీ ఇరాన్పై దాడి, హోర్ముజ్ జలసంధి మూసివేత వార్త రాగానే ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా గుబురుగా మారాయి. ఇదే ప్రశ్నను ఇప్పుడు ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు…
చమురు అంటే కేవలం ఇంధనం కాదు.. Oil Is More Than Fuel
చమురు (Oil Turmoil)అనేది కేవలం వాహనాల్లో వేసే ఇంధనం మాత్రమే కాదు. అది దేశాల మధ్య రాజకీయ ఆయుధం. ఆర్థిక వ్యవస్థలకు ప్రాణవాయువు. ఒక దేశ బడ్జెట్ నుంచి సామాన్యుడి వంటింటి ఖర్చు వరకు అన్నింటినీ ప్రభావితం చేసే శక్తి చమురుకే ఉంది. అందుకే అంతర్జాతీయ రాజకీయాల్లో చమురు ప్రవాహం నిలిచిపోతుందన్న సంకేతం వచ్చిన క్షణంలోనే మార్కెట్లు గజగజలాడతాయి. వెనెజువెలా ఉదాహరణ దీనికి స్పష్టమైన నిదర్శనం. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం అయినా, అక్కడి రాజకీయ అస్థిరత, పాతబడిపోయిన సాంకేతికత, అంతర్జాతీయ ఆంక్షలు… ఈ అన్నింటి వల్ల ఆ దేశం ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించలేకపోతోంది. అందుకే అక్కడ ఏం జరిగినా మార్కెట్లు పెద్దగా స్పందించవు.
ఒపెక్ దేశాలే ప్రపంచ చమురు జీవనాడి.. OPEC – The Nerve Centre of Oil World
ప్రపంచ చమురు (Oil Turmoil)మార్కెట్ను నిజంగా శాసించేది ఒపెక్ దేశాలే. మధ్యప్రాచ్యంలోని ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాలతో పాటు వెనెజువెలా, ఆఫ్రికాలోని కొన్ని చమురు దేశాలు కలసి ఏర్పడిన ఈ సమాఖ్య… ఉత్పత్తి తగ్గిస్తే ధరలు పెరుగుతాయి, పెంచితే ధరలు పడిపోతాయి. అంతటి ప్రభావం వీరిది. ఇక రష్యాను కలుపుకొని మాట్లాడితే ఇవే OPEC+ దేశాలు. ప్రపంచ చమురు నిల్వల్లో, ఉత్పత్తిలో, ఎగుమతుల్లో మెజారిటీ వాటా వీరిదే. ప్రపంచంలో ఉన్న సుమారు 1.7 ట్రిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వల్లో ఎక్కువ భాగం ఈ దేశాల చేతుల్లోనే ఉంది.
నిల్వలే కాదు… ఉత్పత్తే అసలు శక్తి.. Production Matters More Than Reserves
సాధారణంగా మనం ఒక అపోహలో ఉంటాం. “ఎక్కువ నిల్వలున్న దేశమే శక్తివంతం” అని. కానీ వాస్తవం అది కాదు. ఎంత చమురు(Oil Turmoil) నేల కింద ఉందన్నదానికంటే… రోజుకు ఎంత చమురు బయటకు తీస్తున్నారన్నదే అసలు విషయం. వెనెజువెలాలో 300 బిలియన్ బ్యారెళ్లకు పైగా నిల్వలున్నా… అక్కడి చమురు ‘హెవీ క్రూడ్’. దాన్ని వెలికితీయడానికి ఖర్చు ఎక్కువ, సాంకేతికత కష్టం. పైగా రాజకీయ సంక్షోభం, ఆంక్షలు కలిసి ఉత్పత్తిని దెబ్బతీశాయి. అందుకే ప్రపంచ మార్కెట్పై అక్కడి ప్రభావం పరిమితం. దీనికి పూర్తి భిన్నంగా అమెరికా ఉంది. నిల్వల పరంగా తొమ్మిదో స్థానంలో ఉన్నా, ఆధునిక సాంకేతికతతో భూగర్భ పొరల నుంచి షేల్ ఆయిల్ను వెలికితీస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలుస్తోంది.
ఇరాన్ దగ్గరే అసలు నాడి.. Why Iran Triggers Panic
ఇరాన్ చమురు (Oil Turmoil)నిల్వల పరంగా ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. కానీ దాని ప్రాధాన్యం నిల్వల వల్ల కాదు. భౌగోళిక స్థానం వల్ల. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు వెళ్లే మార్గం… హోర్ముజ్ జలసంధి. ఈ జలసంధి మూసివేస్తే… సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ నుంచి బయల్దేరే చమురు నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లాలి. అంటే ప్రయాణ దూరం పెరుగుతుంది. సమయం పెరుగుతుంది. బీమా ఖర్చులు పెరుగుతాయి. చివరికి ఆ భారమంతా వినియోగదారుడిపై పడుతుంది. ఇరాన్పై దాడి జరిగిన క్షణమే బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 83 డాలర్లకు చేరింది. కొన్ని వారాల క్రితం వరకు 70 డాలర్ల దిగువనే ఉన్న ధరలు… యుద్ధ భయంతో ఒక్కసారిగా ఎగబాకాయి.
వెనెజువెలా దాడి… ఎందుకు ప్రభావం లేదు? Why Venezuela Didn’t Shake Markets?
ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు (Oil Turmoil)ఉన్న దేశం వెనెజువెలా. అయినా అక్కడి పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్ను ఎందుకు కదిలించలేకపోయాయి? కారణం చాలా స్పష్టం. వెనెజువెలా ఇప్పటికే అంతర్జాతీయ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించడం లేదు. ఉత్పత్తి తక్కువ. ఎగుమతులు పరిమితం. పైగా అక్కడి చమురు ఎక్కువగా అమెరికాకు వెళ్లేది. ఆ సరఫరా తగ్గినా ప్రపంచ మార్కెట్కు ప్రత్యామ్నాయాలు దొరుకుతాయి. ఇరాన్ విషయంలో అలా కాదు. ఇరాన్ నేరుగా సరఫరా చేయకపోయినా… ఆ దేశం ఉన్న భౌగోళిక స్థానం వల్ల మొత్తం పశ్చిమాసియా చమురు ప్రవాహాన్ని ప్రభావితం చేసే శక్తి ఉంది.
భారత్కు ఎంత ప్రమాదం? India’s Risk Exposure
భారత్కు అవసరమైన చమురులో (Oil Turmoil)దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందులోనూ 35 నుంచి 50 శాతం చమురు హోర్ముజ్ మార్గంలోనే వస్తుంది. కాబట్టి అక్కడ ఏ చిన్న అడ్డంకి ఏర్పడినా… భారత్ ఖర్చులు పెరగడం ఖాయం. అయితే ఇప్పటివరకు భయపడాల్సిన పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కారణం… భారత్ ముందస్తుగా ఏర్పాటుచేసుకున్న వ్యూహాత్మక చమురు నిల్వలు.
భూగర్భ రక్షణ కవచం.. Strategic Petroleum Reserves
యుద్ధాలు, సంక్షోభాల సమయంలో ఉపయోగించేందుకు భారత్ భూగర్భంలో భారీ చమురు(Oil Turmoil) నిల్వలను నిర్మించింది. విశాఖపట్నం, మంగళూరు, పడూర్ ప్రాంతాల్లో ఉన్న ఈ నిల్వలు దాదాపు 9.5 రోజుల అవసరాలకు సరిపోతాయి. ఇవే కాకుండా చండిఖోల్, బికనేర్ వంటి కొత్త కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆయిల్ కంపెనీల వద్ద ఉన్న కమర్షియల్ నిల్వలు కలిపితే… మొత్తం 74 నుంచి 80 రోజుల వరకు దేశానికి ఇంధన భద్రత ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? Will Fuel Prices Rise?
అంతర్జాతీయంగా చమురు (Oil Turmoil)ధరలు పెరిగినా… దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే పెరిగే అవకాశాలు తక్కువ. 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఆ సమయంలో అంతర్జాతీయంగా ధరలు తగ్గినా… దేశంలో తగ్గించలేదు. చమురు కంపెనీలు అప్పట్లో తమ మార్జిన్లను పెంచుకున్నాయి. ఇప్పుడు ధరలు పెరిగినా… ఆ భారాన్ని వినియోగదారుడిపై మోపకూడదన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. కొంత నష్టం వచ్చినా ఆయిల్ కంపెనీలే భరించే అవకాశం ఉంది.
యుద్ధాలు మారతాయి… చమురు రాజకీయం మారదు.. Oil Politics Never Changes
ప్రపంచంలో యుద్ధాలు కొత్తవి కావు. కానీ ప్రతి యుద్ధం ఒకేలా ఉండదు. చమురు నిల్వలు (Oil Turmoil)ఉన్న దేశం కంటే… చమురు ప్రవాహాన్ని నియంత్రించే దేశమే అసలు కీలకం. అందుకే వెనెజువెలా ఘటన మార్కెట్ను కదిలించలేకపోయింది. ఇరాన్ మాత్రం ప్రపంచాన్ని ఉలికిపడేలా చేసింది. ఈ ఉద్రిక్తతలు ఎంతకాలం కొనసాగుతాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. హోర్ముజ్ తెరుచుకుంటే ధరలు కాస్త తగ్గవచ్చు. కానీ యుద్ధ భయాలు కొనసాగితే… చమురు ధరల ఊగిసలాట కూడా కొనసాగడం ఖాయం.సాధారణ వినియోగదారుడికి ఇప్పటికైతే పెద్ద దెబ్బ పడకపోవచ్చు. కానీ ప్రపంచ రాజకీయాల్లో చమురు రాజకీయం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే…చమురు కదిలితే… ప్రపంచమే కదులుతుంది.

