
కిలోమీటరుకు రూ.12 చార్జీ. అదీ విమాన ప్రయాణంలో అంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇది నిజం. సాధారణంగా మన ఊర్లలో ట్యాక్సీలు, ఆటోలు కూడా ఇంతకంటే ఎక్కువ ధరలను వసూలు చేస్తున్నాయి. కానీ ఇప్పడు ఈ ధరకు ఏకంగా విమానయానమే అంటే కొంచెం షాకింగే.. కానీ ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ తో ఇది సాధ్యమని జెట్ సెట్ గో సంస్థ చెబుతోంది. ఇదే జరిగితే ప్రయాణాలు మరింత సులభం, వేగంవంతం అవ్వడమే కాకుండా కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు.
jetsetgo with evtol air croft
అద్దెకు ప్రైవేటు విమానాలను నడుపుతున్న జెట్సెట్గో సంస్థ ఈవీటోల్ ఎయిర్ క్రాఫ్ట్ తో కలిసి ఎయిర్ ట్యాక్సీ రంగంలోకి రావాలని నిర్ణయించుకుంది. దీనికోసం రెండు తయారీ సంస్థలతో మాట్లాడుతున్నామని జెట్ సెట్ గో ఏవియేషన్ సర్వీసెస్ ఫౌండర్ కనిక టేక్రివాలి తెలిపారు. మొదటి హైదరాబాద్, ఆ తర్వాత ముంబై, బెంగుళూర్లో ఎయిర్ ట్యాక్సీ సేవలు పరిచయం చేస్తామన్నారు.
* ఈవీటోల్ ఎయిర్ క్రాప్ట్కు ఇప్పుడు మరింత డిమాండ్ పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 12 సంస్థలు ఈవీటోల్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీలో ఉన్నాయి. వీటిని నడపడానికి పైలెట్ అవసరం లేదు. పైకి లేచినపుడు, కిందకి దిగేటప్పుడు నిటారుగా ప్రయాణిస్తాయి. ల్యాండింగ్ , టేకాఫ్ కోసం ల్యాండింగ్ ప్యాడ్స్ అవసరం. ఒక్కో ట్యాక్సీలో నలుగురు ప్రయాణించవచ్చు. ఒకసారి చార్జింగ్ తో 40 కిలోమీటర్లు వరకు వెళ్ళొచ్చు. కిలోమీటర్ కు అయ్యే చార్జీ రూ.12 మాత్రమే. ఈవీటోల్ ఎయిర్ క్రాఫ్ట్ ఖరీదు సుమారు రూ. 23 లక్షలు ఉంటుంది.
aviation centre at hyderabad
హైద్రాబాద్లో ఏవియేషన్ సెంటర్
ప్రైవేటు రంగంలో దేశంలో తొలి ఏవియేషన్ సెంటర్ హైదరాబాద్ లో రూ.30 కోట్ల ఖర్చుతో మే నెలకి ఏర్పాటు అవుతుంది. ప్రైవేటు జెట్స్ పరిశ్రమకు అవసరమైన మానవ వనరులను ఈ కేంద్రం అందిస్తుంది. ప్రస్తుతం జెటసెట్ గో వద్ద 22 జెట్స్, 2 హెలికాప్టర్స్ ఉన్నాయి. 80 మంది పైలట్లు ఉన్నారు. కొత్తగా ఈ ఏడాది 4 జెట్స్, ఒక హెలికాప్టర్ ఉన్నాయి. అద్దె గంటకు రూ.1.3 లక్షల నుంచి ప్రారంభం.
ప్రైవేటు జెట్స్ రాకపోకల విషయంలో దేశంలో హైదరాబాద్ తొలిస్థానంలో ఉంది. బేగంపేట విమానాశ్రయంలో కోవిడ్ కు ముందు 2-3 ప్రైవేటు జెట్స్ ల్యాండ్ అయ్యేవి. ఇప్పుడు 15 అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ సంఖ్య 250. భారత్ లో ప్రైవేటు వ్యక్తులు, కంపెనీల వద్ద 95 జెట్స్, హెలికాప్టర్స్ ఉన్నాయి. వీటిలో 7 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.