భవిష్యత్తు తమదేనన్న ధీమాతో నేటితరం ముందుకు సాగుతుంది. ఆదాయం పెరుగుతుందన్న నమ్మకం, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయన్న ఆశ, జీవన ప్రమాణాలు మరింత ఎత్తుకు చేరుతాయన్న విశ్వాసం… ఇవన్నీ వారి ఖర్చు(Spending) నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల భావజాలంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) తాజాగా విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే… ప్రపంచం మొత్తం ఆర్థిక ఒత్తిడులతో ఇబ్బంది పడుతున్న వేళ, భారతీయ వినియోగదారుల విశ్వాసమే దేశ ఆర్థిక వ్యవస్థకు బలంగా మారుతోందని బీసీజీ నివేదిక స్పష్టం చేస్తోంది.
భవిష్యత్తుపై గట్టి నమ్మకం..Strong Confidence in the Future
భవిష్యత్తుపై నమ్మకం ఉంటే ఖర్చు(Spending) కూడా పెరుగుతుంది. అదే ఇప్పుడు భారతీయులలో స్పష్టంగా కనిపిస్తోంది. చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఆశావహ వినియోగదారులుగా భారతీయులు నిలవడం… రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వృద్ధికి ఇది కీలక శక్తిగా మారనుంది. బీసీజీ నివేదిక ప్రకారం భవిష్యత్తుపై అధిక విశ్వాసం వ్యక్తం చేస్తున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగదారులు ఖర్చుల (Spending)విషయంలో వెనుకంజ వేస్తున్నా… భారతీయులు మాత్రం ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు.
ఖర్చుకు వెనుకాడని మనస్తత్వం..Unhesitant Spending Mindset
కార్లు, ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు, ఇళ్లు… ఇలా పెద్ద మొత్తంలో ఖర్చయ్యే(Spending) వస్తువుల కొనుగోలుపై కూడా భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ ధోరణి మరింత బలంగా ఉందని బీసీజీ పేర్కొంది. “ఈరోజు ఖర్చు(Spending) చేసినా రేపు సంపాదించగలం” అన్న భావన స్పష్టంగా కనిపిస్తోందని నివేదిక విశ్లేషించింది.
ఆదాయం పెరుగుతుందన్న ఆశ..Hope of Rising Income
డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ, స్టార్టప్ సంస్కృతి, సేవారంగం వృద్ధి, ప్రభుత్వ మౌలిక సదుపాయాల పెట్టుబడులు… ఇవన్నీ భవిష్యత్తులో ఆదాయాలు పెరుగుతాయన్న నమ్మకాన్ని భారతీయుల్లో బలపరుస్తున్నాయి. అదే సమయంలో పొదుపు కూడా కొనసాగుతూనే ఖర్చు (Spending)పెరుగుతుండటం భారత్కు ప్రత్యేకతగా బీసీజీ గుర్తించింది.
ఇతర దేశాలతో పోలిస్తే…Compared to Other Countries…
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆర్థిక అనిశ్చితి, అధిక ధరలు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఖర్చు(Spending) చేయాలంటేనే వెనకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ భారత్లో మాత్రం దృశ్యం భిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడి వినియోగదారులు కొనుగోళ్ల విషయంలో ధైర్యంగా ముందుకొస్తున్నారు. అమెరికా, యూరప్ వంటి ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి కారణంగా వినియోగదారులు ఖర్చును కుదించుకుంటున్నారు. కానీ భారత్లో మాత్రం ఈ ప్రభావం అంతగా కనిపించడం లేదు. అవసరాలతో పాటు సౌకర్యాలకూ ప్రాధాన్యం ఇస్తూ ఖర్చు చేసే ధోరణి కొనసాగుతోంది.
మార్కెట్లకు శుభవార్త..Good News for Markets
మనదేశంలో దాదాపు 60 శాతం కుటుంబాలు భవిష్యత్తుపై ఆశాభావంతో ఉన్నాయి. ఆదాయం పెరుగుతుందన్న నమ్మకంతో ఖర్చు(Spending) చేయడానికి వెనకాడటం లేదని పేర్కొంది. అవసరమైన వస్తువుల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. భారతీయుల ఈ విశ్వాసమే ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్స్, రిటైల్ రంగాలకు శుభవార్తగా మారింది. దేశీయ మార్కెట్పై కంపెనీలు మరింత ఆశలు పెట్టుకోవడానికి ఈ నివేదిక బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా వచ్చే ఆరు నెలల్లో కార్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇళ్ల కొనుగోళ్లకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నారని బీసీజీ నివేదిక తెలిపింది. ఈ ధోరణి కొనసాగితే దేశంలో వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. దీని ప్రభావంతో వినియోగ వస్తువుల అమ్మకాలు అన్ని రంగాల్లో పెరుగుతాయని బీసీజీ అంచనా వేసింది. అందుకే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్, రిటైల్ రంగాల్లోని వ్యాపార సంస్థలు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా తమ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది.
ఏఐ ఆధారిత నిర్ణయాలు.. AI-Driven Decisions
– కొనుగోళ్ల విషయంలో భారతీయ వినియోగదారుల ఆలోచన విధానం వేగంగా మారుతోంది. వస్తువు కొనాలంటే దుకాణం చుట్టూ తిరగడమే కాదు… ముందుగా ఏఐ (కృత్రిమ మేధ) టూల్స్ను ఆశ్రయించి తుది నిర్ణయం తీసుకుంటున్నారు. తాజా బీసీజీ నివేదిక ఇదే విషయాన్ని వెల్లడించింది.
– ఈ ఏడాది నవంబరు నాటికి దాదాపు 62 శాతం మంది భారతీయులు జెన్ ఏఐ టూల్స్ను వినియోగించినట్లు బీసీజీ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఇది 48 శాతం మేర పెరుగుదల కావడం విశేషం. అంటే కొద్ది నెలల్లోనే ఏఐ వినియోగం గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.
– బ్రాండ్ ఎంపిక, వస్తువుల డిజైన్, రూపురేఖలు, పనితీరు, ధరల పోలికలు వంటి అంశాలను వినియోగదారులు ఏఐ టూల్స్ ద్వారా ముందుగానే అధ్యయనం చేస్తున్నారు. ఏది తమ అవసరాలకు సరిపోతుందో, ఏది ఉత్తమమో తెలుసుకున్న తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారు.
– చాలామంది పూర్తిస్థాయి డిజిటల్ వినియోగదార్లుగా మారుతున్నారు. టెక్నాలజీపై అవగాహన పెరగడం, స్మార్ట్ఫోన్ల విస్తృత వినియోగం, ఇంటర్నెట్ అందుబాటు.. ఈ మార్పునకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.
– జెన్ ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ కొనుగోళ్లలోనూ స్పష్టత, జాగ్రత్త పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఏఐ ఆధారిత నిర్ణయాలే మార్కెట్ ధోరణిని మరింతగా ప్రభావితం చేయనున్నాయన్న సంకేతాలు ఈ నివేదిక ఇస్తోంది.
ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటే.. Economy on a Growth Path
– ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ పరిస్థితులు మారుతున్నా… వాటి ప్రభావంతో మనదేశంలో ఆర్థికాభివృద్ధి మందగిస్తుందని భావిస్తున్న వారు తక్కువగానే ఉన్నారు. బీసీజీ తాజా నివేదిక ప్రకారం భారత్లో కేవలం 17 శాతం మంది మాత్రమే ఆర్థిక వృద్ధి మందగిస్తుందన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇదే సమయంలో యూకే, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 60 శాతం మంది ప్రజలు ఆర్థిక మాంద్యం తప్పదని నమ్మడం గమనార్హం.
– మనదేశంలో మాత్రం భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. సుమారు 61 శాతం మంది ప్రజలు “మంచి రోజులు రాబోతున్నాయి” అన్న నమ్మకంతో ఉన్నారని నివేదిక తెలిపింది. అయితే మరోవైపు 34 శాతం మంది మాత్రం నిరుద్యోగం, ఆర్థిక మందగమనం వంటి అంశాలు ఇబ్బంది పెట్టొచ్చన్న ఆందోళన వ్యక్తం చేశారు.
– వచ్చే ఆరు నెలల్లో తమ కుటుంబాల ఖర్చులు పెరుగుతాయని 61 శాతం మంది భావిస్తున్నారని బీసీజీ పేర్కొంది. దీనివల్ల వినియోగం మరింత ఊపందుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. వినియోగదారుల ఖర్చు (Spending)ధోరణి ఆర్థిక వ్యవస్థకు కీలక బలంగా మారనుందని విశ్లేషించింది.
– కొత్త బ్రాండ్లను ప్రయత్నించేందుకు 57 శాతం మంది సుముఖంగా ఉన్నప్పటికీ, 84 శాతం మంది మాత్రం తమకు ఇప్పటికే తెలిసిన, గతంలో వినియోగించిన బ్రాండ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని నివేదిక తెలిపింది. అంటే కొత్తదనానికి అవకాశమున్నా… నమ్మకమే ఇప్పటికీ ప్రధాన ప్రమాణంగా ఉందన్న మాట.
– తరం వారీగా చూస్తే జెన్-జడ్ (Gen Z)తో పోలిస్తే ‘మిలేనియల్స్’, జెన్-ఎక్స్ తమ ఆర్థిక స్థితిగతులపై ఎక్కువ ధీమాతో ఉన్నారని బీసీజీ వెల్లడించింది. అనుభవం ఎక్కువగా ఉండటం, ఆస్తులు కలిగి ఉండటం, బ్యాంకు బ్యాలెన్స్ మెరుగ్గా ఉండటం ఇందుకు కారణాలుగా పేర్కొంది.
– మొత్తంగా చూస్తే… ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారతీయుల విశ్వాసమే ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో ముందుకు నడిపిస్తున్న శక్తిగా మారుతోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

